Posts

మా తాతయ్య

Image
ఈ ఫోటోలో ఉన్నాయన పేరు రొంపిచర్ల చిన శేషాచార్యులు,ఈయన మా నాన్నకు నాన్న అంటే నాకు తాత,ఈ మధ్య ప్రముఖ ఆర్టిస్ట్ బి.ఏ. రెడ్డి గారు ఈయన ఫోటో ఫేస్ బుక్ లో పెట్టమని అడిగారు ,అప్పుడు మా తాతయ్య గురించి నాకు తెలిసిందీ,మా పెదనాన్న చెప్పగా విన్నదీ కాక నాకు ఇప్పుడున్న ఒకే ఒక సోర్సు మా ఆఖరి బాబాయి ప్రభాకర నారాయణా చార్యుల నడిగి తెలుసుకుని ఇది రాస్తున్నాను. మా తాత యేమన్నా మహాత్మా గాంధీ లాగా  దేశాన్ని ఉధ్ధరించే పనులు చేశాడా?సంఘ సంస్కర్త వీరేశ లింగం లాగానో ,మరెవరి లాగానో యేమైనా సంస్కరణలు తీసుకొచ్చాడా అంటే అదేమీ లేదు గానీ,చిన్నతనం లోనే ,ఆరుగురు బిడ్డలనీ ,భార్యనీ ఒంటరి వాళ్లను చేసి తండ్రి చనిపోతే ఇంటికి పెద్ద కొడుకుగా ఆ కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుని పేదరికంలో మగ్గుతున్న కుటుంబాన్ని ఒక దోవకు తీసుకువచ్చి ,ఇల్లూ ,వాకిళ్లూ ,పొలాలూ యేర్పరుచుకుని,తోబుట్టువులకు కూడా యేలోటూ లేకుండా చేసి,ఊళ్లో ప్రజలకు ఆయుర్వేద వైద్యుడిగా సేవలందిస్తూ తలలో నాలుకలా మెలిగిన వ్యక్తి.అసలు ఇవన్నీ లేకపోయినప్పటికీ మన మూలాల గురించి మనం తెలుసు కోవలసిన అవసరం వుంది.మన వేరుల గురించి మనం సిగ్గు పడాల్సింది లేదు,కాయకష్టం చేసే వాళ్ల దగ్గరనుం...

భగ్నమయిన వొక సుందర స్వప్నం

Image
  హిందీ సినిమా పాటల ప్రియుల పాలిట భగ్నమయిన వొకసుందర స్వప్నం గీతాదత్. మొట్టమొదటి సారి ఆమెగొంతువిన్నపుడు వొక వుద్వేగానికి గురయ్యాను నేను, యేవిటీ యీ గొంతు యింత లాగేస్తోంది, యేముందీ గొంతులో అని గిలగిలా కొట్టుకున్నాను  వరసగా ఆమె పాటలువింటుంటే పిచ్చెక్కి పోతుంది నాకు ఆరేంజ్ చూసి .నిర్వచనాలకి అందని యిమిటేషన్ కి లొంగనీ గొంతు ఆమెది . ఆమె పాటలోని ప్రత్యేకతయేమిటంటే పాడే పాటకి జవం,జీవం,మార్దవం ,మాధుర్యం అద్ది తన సొంతంచేసుకోవడం అందుకనే అదే పాట వేరెవరి నోటయినా వింటే చప్పగా వుంటుంది. ఒక లాలి పాట గానీ ప్రేమగీతం గానీ,క్లబ్ సాంగ్ గానీ,భజన్ గానీ విషాద గీతిగానీ ,హాస్యగీతం గానీ యే పాట నయినా తన గొంతులో అవలీలగా పలికించడమే కాక దానికి నూటికి నూరుపాళ్లూ న్యాయం చేయడం ఆమెను అత్యున్నత నేపథ్య గాయనిగా నిలబెట్టాయి. గులాబీ రేకులోని సౌకుమార్యం,మొగలిరేకులోనిమెత్తగా గుచ్చుకునే గుణం ,పచ్చకర్పూరంలోనిచల్లదనంతో కూడిన పరిమళపు ఘాటూ ఇవన్నీ గుర్తొస్తాయి నాకు ఆమె పాట విన్నపుడు .ఒక్క మాటలో చెప్పాలంటే వొక లతా, వొక ఆశా ,వొక షంషాద్ బేగం కలిస్తేవొక గీతా దత్ అనిపిస్తుంది నా మటుకు నాకు. ఆమె గాన ప్రయాణం పరిశీలించితే ఆమె కెరీర్ ల...

పర్వీన్ బాబీ - ఓ విషాద నిషాదం

Image
ఆమె జీవితం గురించి చెప్పాలంటే ,వ్యథాభరిత జీవితమనీ,పగిలిన అద్దం అనీ,విరిగిన శిల్పమనీ,రంగు వెలిసిన చిత్రమనీ ఇలా  తేలిగ్గా నాలుగు మాటల్లో చెప్పేయచ్చేమో కానీ , ఒక మనిషి గా ఆమె జీవించిన జీవితం కదా అది, ఆ జీవితంలో ఆమె మోసిన అభద్రతలనీ,తట్టుకున్నయెడబాటులనీ,భగ్నమయిన కలలనీ ,తుంచుకున్న ఆశలనీ,యెదుర్కొన్న ఒంటరి తనాన్నీ, బతికి వున్నంత కాలం ఒక్క నిమిషం నిలవనీకుండా చేసి  సముద్రపు అలలవలే ముంచెత్తి పిచ్చెక్కించిన ఆలోచనలనీ వ్యక్తీకరించడానికి అక్షరాలు సరిపోతాయా అనిపించింది,ఆమె జీవిత చరిత్ర చదివాక. పర్వీన్ బాబీ హిందీ చలన చిత్ర సీమలో ఒకప్పటి గ్లామర్ క్వీన్ .కొంచెం వెస్టర్న్ లుక్ తో జీనత్ అమన్ లాగే సినీ ప్రియులను అలరించిన బ్యూటీ. దాదాపు యాభై,అరవై హిందీ సినిమాలలో నటించింది.అందులో  యెనిమిది సినిమాలు అమితాబ్ తో నటించినవి హిట్లూ,సూపర్ హిట్లూ.ఆమె నటించిన సినిమాలలో కొన్ని ముఖ్యమైన వాటి పేర్లు "దీవార్ ,అమర్ అక్బర్ ఆంథోనీ,కాలా పత్థర్ ,షాన్ ,ది బర్నింగ్ ట్రైన్ ,నమక్ హలాల్ " ఆమె వేసే పాత్రలలాగే ఆమె  ప్రవర్తన కూడా డేరింగ్ గా ,డాషింగ్ గా వుండేది. కానీ నిజం చెప్పాలంటే ఆమె  ఒక ఇంట్రోవర్ట్ ,తెలివైనద...

తెలుగు సాహిత్య రంగంలో వినపడిన శక్తివంతమైన అన్య స్వరం "శారద"

Image
 శక్తివంతమైన అన్య స్వరం అని ఎందుకన్నానంటే 1948-55 ప్రాంతాలలో "శారద" రచనలు ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపాయి,అతను రచనలు చేసింది కొద్దికాలమైనా( సుమారు ఆరేడేళ్లు)అయినా ఒక సంచలనం సృష్టించిన వాడు "శారద" అతని రచనలని ఎన్నదగిన రచయితలయిన నండూరి రామ్మోహన్రావు,ముళ్లపూడి వెంకట రమణ,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి దగ్గర నుండీ సామాన్య తెలుగుపాఠకుడి వరకూ ఆసక్తిగా చదివేవారు ఆరోజుల్లో అంటే అతడెంత శక్తివంతమయిన రచయితో అర్థమవుతుంది. అన్య స్వరం అనడానికి కారణం అతను తెలుగువాడు కాదు తమిళుడు, సుమారు పన్నెండేళ్ల వయసులో పొట్టచేత్తో పట్టుకుని,తండ్రితో పాటు ఉపాథి వెదుక్కుంటూ తమిళనాడు నుండీ తెనాలి వలస వచ్చిన వాడు . అలాంటి వాడు ఒక చెంప దుర్భర దరిద్రం అనుభవిస్తూ ,పస్తులుంటూ,హోటల్లో సర్వరు గానూ,కూలీ గానూ,ఇంకా అనేక చిన్నా చితకా పనులు చేస్తూ,తెలుగు భాష  నేర్చుకుని,ఆ భాషని ప్రేమించి,అందులో రచనలు చేయడం ఎంత గొప్ప విషయం!అవసరం కోసం భాష నేర్చుకునే వారు అనేక మంది వుంటారు కానీ ఆ భాషమీద ప్రేమను పెంచుకునే వారు తక్కువ,ఒక వేళ ఆ భాషంటే ఇష్టం వున్నా, ప్రతిభా వంతమైన రచనలు చేసే వారు  దాదాపు అరుదనే చెప్పాలి. అతని రచనల గు...

"ఒరేయ్! వెంకటచలం"

Image
రచయితలు సాధారణంగా ఒక కథ రాసినపుడు వేరే రచయితల్ని విమర్శించడమో, సమాజంలోని ఒక విషయాన్ని విమర్శించడమో చూస్తుంటాం. కానీ చలం తన ఒరేయ్, వెంకటచలం అనే కథలో రెండు పాత్రల్ని పెట్టి తనని తనే విమర్శించుకుంటూ ఈ కథ వ్రాయడం జరిగింది. తెలుగులో నేను ఇటువంటి కథ ఇంకొకటి చదవలేదు, అందువల్లనే ఈ కథ అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. పూర్తి కథ మీ కోసం .

చేతులు కడుక్కోవడం - దాని వెనుక చరిత్ర. ఇంకా ఇగ్నోజ్ సెమ్మల్ వీజ్ గురించి విశేషాలు

Image
ఈ రోజు ఒక పక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం, ఇంకో పక్క కరోనా భయంతో వణికి పోతున్నాం. కరోనా ను తప్పించుకోవడానికి పదే పదే చేతులు శుభ్రంగా కడుక్కోవడమే మార్గమని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అసలు చేతులెలా పరిశుభ్రం చేసుకోవాలి?దానివలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి?ఇలా చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే వ్యాథులు దరి చేరకుండా వుంటాయని మొదటగా చెప్పిన మహానుభావుడెవరూ?చివరికాయన జీవితమెలా పరిణమించిందీ?ఒకసారి తెలుసుకుందామా? ప్రతి వ్యక్తీ తన చేతులను సబ్బు తోగానీ,ఇతర డిసిన్ఫెక్టంట్ ద్రావణంతో గానీ రుద్ది,తోమి ,తేటగా వుండే చన్నీళ్లతో గానీ,వేడినీటితో గానీ కడుక్కుని పొడి బట్టతో తుడుచుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి చేతులు పరిశుభ్రంగా వున్నాయని అర్థం.మామూలుగా నీళ్లతో మాత్రమే కడుక్కుంటే అవి పరిశుభ్రం కావు యే ప్రయోజనమూ వుండదు. అలా శుభ్రం చేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు-   చేతులపై వుండే దుమ్మూ,ధూళీతో పాటుజిడ్డూ తో బాటు కంటికి కనపడని అనేక వ్యాథి కారక క్రిములు కూడా తొలగింపబడతాయి, ఆ విధంగా అనేక వ్యాథులు రాకుండా నివారించ వచ్చు. నివారింపబడే వ్యాథులు-   జలుబు (సాధార...

సీమచింత-నా చింత

Image
చింత అంటే కేవలం పులుపనే కాదు,ఆలోచన,కష్టం అనే అర్థాలు కూడా వున్నాయి."మో" అని పిలువబడే వేగుంట మోహన ప్రసాద్ గారి మొట్టమొదటి కావ్యం "చితి--చింత" ప్రఖ్యాత నైరూప్య చిత్రకారులు యస్వీ.రామారావు గారి చిత్రం ,ముఖచిత్రంగా వెలువడింది,పూర్తిగా అర్థమయినా,కాకపోయినా కొనుక్కుని చదివి ,దాచుకున్నా,ఇంకా వుంది నా లైబ్రరీలో. త్యాగరాజస్వామి "తెలిసి రామచింతనతో నామము చేయవే మనసా"----పూర్ణచంద్రిక రాగం "చింతా నాస్తికిలా " సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన,రెండూ బాలమురళీ గొంతులో బాగుంటాయి. "ఆ చింత నీకేలరా స్వామీ నీచెంత నేనుండగా" అనే సినిమా పాట ఈ మధ్య పదే పదే గుర్తొస్తోంది ఎందుకో,ఏ సినిమా లోదా?అని వెదికితే "శుభోదయం"కె.విశ్వనాథ్ గారి సినిమాలో,అయితే కొన్ని పాటలు వింటేనే బాగుంటాయి ,చూసేకంటే ఇది ఆ కోవలోదే ,ఏ మాటకామాటే సుశీల గొంతు ఈ పాటలో  వింటుంటే పాలకోవా తిన్నట్టే వుంటుంది. సరే ఆ చింత సంగతి అక్కడ బెడితే ఈ మధ్య నా నడక దారిలో కనపడే చెట్లను పరిశీలిస్తూ వుండగా,హఠాత్తుగా మా చిన్నప్పుడు కనపడిన కొన్ని చెట్లు ,ఇప్పుడు చాలా వరకూ కనపడటం మానేశాయని తోచింది,వాటిల...