వైవిధ్యమయిన గాయని రాణి
పదీ, పదకొండేళ్ల వయసులో 'దేవదాసు'లో పాడిన పాటల ద్వారా ఆమె శ్రోతల గుండెల్లో కొలువు తీరిపోయింది. ఎన్నాళ్లు గడిచినా మరవని ఓ మధురిమ మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఆమె తెలుగు చలనచిత్ర గాయని కె.రాణి. ఆమెది భలే విచిత్రమైన గొంతు. ఘంటసాల గారి చేత 'రాణీ, నీ గొంతులో మిర్చి మసాలా ఘాటు ఉందమ్మారు!' అని అనిపించుకున్న ప్రత్యేకమైన గొంతు ఆమె సొంతం! ఆమెవి కొన్ని పాటలు వింటుంటే జిక్కీ గుర్తొస్తుంది. కొన్ని వింటుంటే పి.లీల పాడారేమో అనిపిస్తుంది. మరికొన్ని పాటల్లో జమునారాణి గుర్తొస్తుంది. అప్పుడప్పుడూ సుశీలలాగానూ అనిపిస్తుంది. అందుకే ఆమె గొంతు గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. చాలామంది ఆమెనీ, జమునారాణినీ కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం జాగ్రత్తగా వింటే మాత్రం ఆ గొంతులోని విలక్షణత అర్థమవుతుంది. ఆమె గొంతులో విలక్షణత పలికే చక్కని శృతినీ, పెప్నీ గమనించిన సంగీత దర్శకులు ఆమెకు చక్కటి అవకాశాలిచ్చారు. అన్ని భాషలూ కలుపుకుని ఆమె సుమారు 500 పాటలు పాడారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలోనే కాకుండా, సింహళ, ఉజ్బెక్ భాషల్లోనూ పాడారు. సింహళ భాషలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో ఆవిడ పాడిన జా