చేతులు కడుక్కోవడం - దాని వెనుక చరిత్ర. ఇంకా ఇగ్నోజ్ సెమ్మల్ వీజ్ గురించి విశేషాలు
ఈ రోజు ఒక పక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం, ఇంకో పక్క కరోనా భయంతో వణికి పోతున్నాం. కరోనా ను తప్పించుకోవడానికి పదే పదే చేతులు శుభ్రంగా కడుక్కోవడమే మార్గమని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అసలు చేతులెలా పరిశుభ్రం చేసుకోవాలి?దానివలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి?ఇలా చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే వ్యాథులు దరి చేరకుండా వుంటాయని మొదటగా చెప్పిన మహానుభావుడెవరూ?చివరికాయన జీవితమెలా పరిణమించిందీ?ఒకసారి తెలుసుకుందామా? ప్రతి వ్యక్తీ తన చేతులను సబ్బు తోగానీ,ఇతర డిసిన్ఫెక్టంట్ ద్రావణంతో గానీ రుద్ది,తోమి ,తేటగా వుండే చన్నీళ్లతో గానీ,వేడినీటితో గానీ కడుక్కుని పొడి బట్టతో తుడుచుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి చేతులు పరిశుభ్రంగా వున్నాయని అర్థం.మామూలుగా నీళ్లతో మాత్రమే కడుక్కుంటే అవి పరిశుభ్రం కావు యే ప్రయోజనమూ వుండదు. అలా శుభ్రం చేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు- చేతులపై వుండే దుమ్మూ,ధూళీతో పాటుజిడ్డూ తో బాటు కంటికి కనపడని అనేక వ్యాథి కారక క్రిములు కూడా తొలగింపబడతాయి, ఆ విధంగా అనేక వ్యాథులు రాకుండా నివారించ వచ్చు. నివారింపబడే వ్యాథులు- జలుబు (సాధారణంగా వచ్చ