ఒంటరి------ప్రకృతి లోకి ఒక ప్రయాణం
సమస్త ప్రాణికోటితో నిండిన ,అనేక రకాలయిన జంతువులున్న ఈ చరాచర ప్రపంచంలో మనిషి కూడా ఒక రకమయిన జంతువే.భాషనేర్చిన జంతువు మనిషి అంటారు కొందరు.ఇక్కడ కూడా నాదొక పేచీ---జంతువులకు కూడా వాటి భాష వాటికుందేమో మనకేం తెలుసు? ఆది కాలంలో ప్రకృతికి దగ్గరగా దానిలో ఒక భాగమై,అందులోని ప్రాణికోటితో సావాసం చేస్తూ,ఒక సమతౌల్యం సాధించి జీవనం సాగించేవాడు మనిషి.జంతువులతో పాటు మందలు మందలుగా జీవించడానికి అలవాటు పడిన అతను నెమ్మదిగా నాగరికతను అలవరచుకుని,నగరాలు నిర్మించుకుని ప్రకృతికి దూరమయ్యాడు.శారీరక శ్రమ చేసి ఆహారం సంపాదించడం కంటే,శరీరాన్నేక్కువ కష్టపెట్టకుండా సులువుగా ఆహారాన్ని సంపాదించడమే కాక ,ప్రకృతి భీభత్సాలకు తట్టుకుని ,భద్రతగా భద్రతగా జీవించడానికి అనేక ఉపాయాలు నేర్చాడు. ఈ పరిణామ క్రమంలో తనను తను కోల్పోతున్నాడు.సహజాతంగా తనకు సంక్రమించిన ఇన్ స్టింక్ట్స్ ని కోల్పోవడంతోబాటు ,ప్రకృతి ప్రసాదించే అలౌకికానందాన్ని జారవిడుచుకుంటున్నాడు.శారీరకంగా,మానసికంగా బలహీనుడయ్యి వింత,వింత వ్యాధుల బారిన పడుతున్నాడు ఇలాంటి భావజాలంతో,ఈ విషయాలన్నీ ఈ తరం వారికి చెబుతూ-----ప్రకృతిని కాపాడుకుంటే మనను మనం కాపాడుకున్నట్టే అని చెప్పడం ఈ రచన